నరసన్నపేట మండల కేంద్రంలో జనాభా గణన కార్యక్రమం ప్రారంభమైంది. తహసిల్దార్ టి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల నాలుగు విడతల శిక్షణా తరగతులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు జనాభా గణన కొనసాగుతుంది. ఈ గణన కోసం 137 బ్లాకులలో 121 మంది సిబ్బందిని, 19 మంది సూపర్వైజర్లను నియమించారు.