జలుమూరు మండలం కరకవలస గ్రామ సమీపంలోని కొండపై కొలువైన శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం గిరి ప్రదక్షణ కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం కొండ దిగువన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కొండపైకి బయలుదేరారు. నిర్వాహకుల ప్రకారం, గతంలో కంటే ఈరోజు ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు. ఈ గిరి ప్రదక్షణ రాత్రి వరకు కొనసాగుతుందని భక్తులు తెలిపారు.