జలుమూరు మండలం అక్కురాడ సచివాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక అధికారులతో గురువారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో కే సాయి ప్రత్యూష, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.