జలుమూరు మండలం రామకృష్ణాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలను గురువారం ఎంఈఓ బమ్మిడి మాధవరావు పరిశీలించారు. ఆయన ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులను నేరుగా కలిసి వారి బోధన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. బోధనలో ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ, విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలని, భవిష్యత్తు ప్రణాళికను నేటి నుండే రూపొందించుకోవాలని ఆయన సూచించారు.