జలుమూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే క్రికెట్ పోటీలను ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎంవీఎస్ ప్రసాదరావు మంగళవారం జలుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన జట్లు డివిజన్ స్థాయికి ఎంపిక అవుతాయని వివరించారు. ఈ పోటీలలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.