జలుమూరు ఎంఆర్సి కార్యాలయంలో ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, ఎం. వి. ఎస్ ప్రసాదరావు వంట ఏజెన్సీ సభ్యులతో సమావేశమయ్యారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రభుత్వ సూచనల ప్రకారం మెనూ ప్రకారం ఆహార నాణ్యత కొనసాగాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పకడ్బందీగా భోజన పథకం నిర్వహించేందుకు కృషి చేయాలని, వంట గదులు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలు బుధవారం నాటి సమావేశంలో వెలువడ్డాయి.