తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఎసీ) అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ను బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం సైరిగాం గ్రామానికి చెందిన ముద్దాడ రవిచంద్ర సీనియర్ ఐఏఎస్ అధికారిగా ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ఈ నియామకంపై పలువురు అభినందనలు తెలిపారు.