జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం గురువారం రాత్రి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏడుకొండలు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మాఘమాస శుద్ధ బహుళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.