నరసన్నపేట నియోజకవర్గం ఎన్జీవో సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఏరియా హాస్పిటల్ రేడియోగ్రాఫర్ కె.వి.వి. కృష్ణమూర్తి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసన్నపేట సబ్ ట్రెజరీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపికను ప్రకటించారు. కృష్ణమూర్తి తన పదవీకాలంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. విశ్రాంత ఏవో ఏపీ రమణమూర్తితో పాటు పలువురు ఆయనను అభినందించారు.