నరసన్నపేట మండలం గోపాల పెంట గ్రామానికి చెందిన సనపల బాలకృష్ణ (36) మంగళగిరిలో పనిచేస్తుండగా, ఈ నెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి బంధువులకు ఆలస్యంగా సమాచారం అందడంతో మంగళగిరి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం గోపాల పెంటకు తీసుకువచ్చి బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.