నరసన్నపేట మండలం కంబకాయ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను స్థానిక ఉపాధ్యాయులు అభినందించారు. సోమవారం హెచ్ఎం బమ్మిడి మన్మధరావు మాట్లాడుతూ, ఇటీవల రాజ్యాంగ దినోత్సవం, గణిత ప్రతిభ పోటీలలో తమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు మండల స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. వీరంతా నియోజకవర్గస్థాయి పోటీలకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.