ఏడాది ఖరీఫ్ సీజన్ను ముందస్తుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ ఏడి ఎన్ వెంకట మధు తెలిపారు. బుధవారం సాయంత్రం నరసన్నపేట మండలం సత్యవరం రైతు భరోసా కేంద్రాల్లో రైతులతో సమావేశం నిర్వహించి, విత్తనాలు కూడా ముందుగానే అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్య కుమారి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.