నరసన్నపేట మండలంలో వైసిపి పాలనలో చేపట్టిన గృహ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీపీ అరంగి మురళీధర్ ఆదేశించారు. గురువారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెల్త్ ఓవర్ భూములపై సరైన నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యలపై చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.