తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణతో పాటు, నరసన్నపేట ఏఎంసి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.