మంగళవారం ఉదయం నరసన్నపేట మండలం దేవాది ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను ఎంఈఓ పేడాడ దాలినాయుడు పరిశీలించారు. ఆయన విద్యార్థులతో మమేకమై లెక్కలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు ఒక గంట పాటు చదువుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు.