నరసన్నపేటలోని జగన్నాధపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ 1 ఉప్పాడ శాంతారావు ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హోంవర్క్ లను ప్రతిరోజూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన సూచించారు. విద్యార్థుల వర్క్ బుక్కులను పరిశీలించి, వారికి పలు సూచనలు అందించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.