శనివారం నరసన్నపేట మండలం మాకివలస పీహెచ్సీని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరును ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగులకు మర్యాదపూర్వక వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆయుష్ కేంద్రాన్ని పరిశీలించి, హోమియోపతి మందుల విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యురాలు సీతామాలక్ష్మి ఆయనకు పరీక్షలు చేసి హోమియోపతి మందులను అందజేశారు.