అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించాలని అంగనవాడి వర్కర్స్ యూనియన్, సిఐటియు మంగళవారం సాయంత్రం నరసన్నపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. సిఐటియు నాయకుడు చలపతిరావు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కనీస వేతనాల కోసం పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారికి (పిఓ) వినతి పత్రం సమర్పించారు.