నరసన్నపేట మండలం రావుల వలస ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం నలుగురు
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలిసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి గురించి వివరించారు. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.