మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి విశ్వేశ్వరరావు సోమవారం నరసన్నపేట మేజర్ పంచాయితీలో ఎన్టీఆర్ భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని, వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల వితంతువులకు కూడా పింఛన్లు మంజూరు చేశారని, లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.