సారవకోట మండలం కిన్నెరవాడ వడ్డినవలస వద్ద ఉన్న రహదారి నిర్మాణానికి రూ.15 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని, నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు నిలిచిపోయాయని ఆర్ అండ్ బి ఏఈ సరోజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ, వడ్డినవలస నుండి కొమనాపల్లి వరకు ఉన్న ఈ రహదారిని మరో మూడు నెలల్లో పూర్తి చేయడానికి గుత్తేదారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.