ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తున్నట్లు ఎంఈఓ మడ్డు వెంకటరమణ తెలిపారు. బుధవారం సారవకోట ఎంఆర్సీ కార్యాలయంలో ఏడు సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించారు. దీని ద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.