మంగళవారం సారవకోట మండలం కేళవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న జిఎఫ్ఎల్ఎన్ ఎండ్ లైన్ అసెస్మెంట్ విధానాన్ని ఎంఈఓ 2 కోడి భూలక్ష్మి పరిశీలించారు. సీఆర్పీ ప్రసాద్తో కలిసి ఆమె అసెస్మెంట్ను పర్యవేక్షించారు. విద్యార్థులకు అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.