ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 రాత పరీక్షలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు బుధవారం, డిసెంబర్ 3న విడుదల కానున్నాయి. టెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ ఆన్లైన్ రాత పరీక్షలు డిసెంబర్ 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.