కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం శ్రీకాకుళంలో ఎంపి కప్ 2026 బాక్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లను వీక్షించారు. క్రీడలను దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంతో పాటు అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేయవచ్చని ఆయన అన్నారు. సిక్కోలు యువత క్రికెట్ ప్రదర్శనను ఆయన ప్రశంసించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు.