కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబానికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించింది. దీంతో మరణించిన వారికి మొత్తం రూ.17 లక్షలు, గాయపడిన వారికి రూ.3.50 లక్షలు అందనున్నాయి. మృతుల్లో టీడీపీ కార్యకర్తలు ఉండటంతో వారికి అదనంగా రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కూడా లభించనుంది.