హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్ మరమ్మత్తుల కోసం ప్రభుత్వం ఎట్టకేలకు రూ.16 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్యారేజ్ కు ఇంతవరకు మరమ్మత్తులు జరగలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం స్పందించి, నిధులు కేటాయిస్తూ రాష్ట్రమంత్రి అచ్చం నాయుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.