సారవకోట, పాతపట్నం మండలాల ఉపాధ్యాయులతో గురువారం నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ తరగతుల్లో ఎంఈఓ మధు వెంకటరమణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బోధన విధానాలలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే బోధనలో అనేక మార్పులు వచ్చాయని, మరింత మెరుగైన బోధన అందించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.