శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొత్తపల్లి రామ్ చరణ్, జిల్లాకు విచ్చేస్తున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కోసం ఏ4 పేపర్, సర్జికల్ బ్లేడుతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. ఈ అద్భుతమైన చిత్రాన్ని చెక్కడానికి నాలుగు గంటల సమయం పట్టిందని, దీనిని ఉపరాష్ట్రపతికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపాడు. తన తండ్రి వద్ద ఈ కళను నేర్చుకున్నట్లు విద్యార్థి పేర్కొన్నాడు.