ఆమదాలవలస పట్టణంలోని పాల పోలమ్మ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా భవాని దీక్ష ఘనంగా ప్రారంభమైంది. గురుస్వామీ పాతినా రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష 41 రోజుల పాటు కొనసాగుతుందని, భక్తులు ఆచార నియమాలను పాటిస్తూ భగవతి భవానిని ప్రార్థించాలని గురుస్వామీ తెలిపారు. భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.