శ్రీకాకుళం నగరంలో ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జేమ్స్, కిమ్స్ సంస్థలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ముందస్తు అవగాహన, ఆరోగ్యకరమైన ఆహారం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను జయించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.