శ్రీకాకుళం రూరల్, బమ్మిడివానిపేటలో గతంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేసి, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ కోసం గ్రామ ప్రజలు, ఉపాధి హామీ పని వేతనదారులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతుగా రూ.18,150 ఆర్థిక సహాయం అందించి, ఆయన చికిత్సకు తోడ్పాటు అందించారు. శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని శనివారం గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.