ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలిఉన్న ఖాళీల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి గడువు ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు గార మండలం వమరవల్లి గురుకుల విద్యాలయం హెచ్ఎం వై. చిట్టితల్లి ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో చేరే విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోగా ఆన్ లైన్లో https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న జరుగుతుందన్నారు.