డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జనసైనికులు గురువారం మహా పాదయాత్ర చేపట్టారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. పవన్ కల్యాణ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ, సింహాచల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నట్లు జనసైనికులు తెలిపారు.