శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు గురువారం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం,
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 'ప్రజల వద్దకే పాలన' స్ఫూర్తి నేటికీ కొనసాగుతోందని విశ్వేశ్వరరావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సూర్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.