2026-27 విద్యా సంవత్సరానికి గాను టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు గురువారం తెలిపారు. జూన్ 12 నుండి జులై 30 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. గడువు దాటిన తర్వాత, ఆగష్టు 1 నుండి 15 వరకు రూ.200 అపరాధ రుసుంతో నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం సంబంధిత ఓపెన్ స్కూల్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు.