శ్రీకాకుళం పట్టణంలోని ఎల్బీఎస్ కాలనీలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని వన్ టౌన్ ఎస్ఐ ఎం హరికృష్ణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి, నాలుగు లక్షల 45 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.