శ్రీకాకుళం మండలం సింగుపురం వాసి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పుట్రేవు వెంకట సత్య గౌతమ్ దుబాయ్ లోని దోహా ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్నారు. కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ వెళ్తుండగా యుద్ధం ప్రకటించడంతో దోహాలో నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, యుద్ధ వాతావరణం భయంకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి ప్రసాద్ వార్డెన్.