శ్రీకాకుళంలోని బలగ మెట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందారు. స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడని, బలగ మెట్టులోని ఒక ఆలయం వద్ద అస్వస్థతకు గురై మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం 2టౌన్ పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.