అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఈ నెల 28న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. బక్రీద్ పండుగ కారణంగా పరీక్షను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈవో ఏ. రవిబాబు తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.