సీఎం చంద్రబాబు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. బంధువులు, అనుచరులు చేసే తప్పులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో కూటమి నేతలతో జరిగిన సమావేశంలో క్యాడర్ను కలుపుకొని ముందుకు సాగాలని, కూటమి పార్టీలతో సమన్వయం పాటించాలని సూచించారు. వైసీపీకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.