శనివారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్కులో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో యోగా శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. యోగా శిక్షణ గురువు పాండ్రంకి మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం గంట పాటు యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.