శ్రీకాకుళం గాంధీ మందిరంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో సోమవారం ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ 132వ జయంతిని ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమకాలంలో గరిమెళ్ల పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయని నిష్టల నరసింహమూర్తి, వేణుగోపాల్ పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో స్వాతంత్ర భావన పెంపొందించడంలో ఆయన పాత్ర గొప్పదన్నారు.