మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో భేటీ కానున్నారని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తూ, ఆలోచింపజేసే దిశగా ప్రసంగాలు చేస్తుండడంతో అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, జగన్ ఆయనకు కేంద్ర పార్టీ పగ్గాలు అప్పగించేందుకు చూస్తున్నారని సమాచారం.