శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయ సమీపంలో నాగావళి నదిలో భక్తులు కార్తీక దీపోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున నది తీరానికి చేరుకున్న భక్తులు కార్తీక దీపాలను నదిలో వదిలిపెట్టారు. ఈ ఏడాది నదిలో నీరు ప్రవహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నది వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.