నరసన్నపేట టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన మాట్లాడుతూ, లూయిస్ బ్రెయిలీ అంధులకు ఒక వరమని, కూటమి ప్రభుత్వం వారికి ప్రత్యేక పథకాలు అందించి, అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని శనివారం రాత్రి శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో జరిగిన లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.