శ్రీకాకుళం రూరల్ మండలం పీజీ పేట వద్ద ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోండు శంకర్రావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డిఓ సాయి ప్రత్యూష శనివారం పరిశీలించారు. ఇటీవల తుఫాన్ కారణంగా సముద్రపు ఒడ్డున దెబ్బతిన్న ప్రాంతాన్ని పర్యవేక్షించిన అధికారులు, తక్షణమే మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. మత్స్యకారులను తుది హెచ్చరిక వచ్చేవరకు వేటకు వెళ్లవద్దని సూచించారు.