శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలోని శ్రీ కొండమ్మ సహిత హటకేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గోండు శంకర్రావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ బలోపేతం కోసం ఈ పూజలు చేశామని, తమ పార్టీపై దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.