రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ను రెండు నెలలు ముందుగానే, అంటే మే నెల నుండే ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటామని, దీనివల్ల రైతులు విపత్తుల నుండి తమ పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.