శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఈనెల 27వ తేదీ నుండి ఆదివారం వరకు జరిగిన ఏపీ రెవెన్యూ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ క్రీడా పోటీలలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు.